కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు యేసును నమ్ముతారా?

యెహోవాసాక్షులు యేసును నమ్ముతారా?

 నమ్ముతాం. “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అని చెప్పిన యేసు మీద మాకు విశ్వాసం ఉంది. (యోహాను 14:6) ఆయన పరలోకం నుండి భూమ్మీదకు వచ్చి, తన పరిపూర్ణ మానవ జీవితాన్ని విమోచన క్రయధనంగా అర్పించాడని నమ్ముతాం. (మత్తయి 20:28) ఆయన మరణ, పునరుత్థానాల ద్వారా ఆయన మీద విశ్వాసముంచిన వాళ్లకు నిరంతరం జీవించే అవకాశం దొరికింది. (యోహాను 3:16) అంతేకాదు దేవుని పరలోక రాజ్యంలో యేసు ఇప్పుడు రాజుగా పరిపాలిస్తున్నాడని కూడా నమ్ముతాం, ఆ రాజ్యం త్వరలోనే ఈ భూమ్మీద శాంతిభద్రతలను తీసుకొస్తుంది. (ప్రకటన 11:15) అయితే, “తండ్రి నాకంటె గొప్పవాడు” అని యేసు అన్న మాటలతో సమ్మతిస్తాం. (యోహాను 14:28) అందుకే మేము యేసును ఆరాధించం, ఆయన సర్వశక్తిగల దేవుడు అని నమ్మం.